బాబు, లోకేష్ లను కాపాడడానికే వచ్చావా పవన్?

నిన్న అమరావతిలో పర్యటించి భూములిచ్చిన కొందరు రైతులను కలిసిన పవన్ కళ్యాణ్… వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మంత్రి బొత్సను విమర్శించాడు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ పార్టీ ఎజెండా టీడీపీని కాపాడడమేనని.. అవినీతిని ప్రోత్సహించేలా పవన్ మాట్లాడుతున్నాని బొత్స ఫైర్ అయ్యారు. ఇక మంత్రి బొత్స తాజాగా…. చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ కు ఇంటి స్థలం ఇచ్చిన […]

Advertisement
Update: 2019-09-01 06:26 GMT

నిన్న అమరావతిలో పర్యటించి భూములిచ్చిన కొందరు రైతులను కలిసిన పవన్ కళ్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మంత్రి బొత్సను విమర్శించాడు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ పార్టీ ఎజెండా టీడీపీని కాపాడడమేనని.. అవినీతిని ప్రోత్సహించేలా పవన్ మాట్లాడుతున్నాని బొత్స ఫైర్ అయ్యారు.

ఇక మంత్రి బొత్స తాజాగా…. చంద్రబాబుకు అమరావతిలో ఇల్లు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ కు ఇంటి స్థలం ఇచ్చిన వ్యక్తి ఒక్కరేనని.. చంద్రబాబు, పవన్ కు మధ్యనున్న బంధానికి ఇదే నిదర్శనమని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసి పవన్ ను డిఫెన్స్ లోకి నెట్టారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి, చేసిన పనుల గురించి ఒక్కరోజు కూడా ఎందుకు విమర్శించరని… బొత్స జనసేన అధ్యక్షుడైన పవన్ ను సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమని ప్రజలు గెలిపిస్తే మూడు నెలలు కాకముందే రోడ్డెక్కుతారా? అని బొత్స తీవ్ర స్థాయిలో పవన్ పై మండిపడ్డారు.

పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని మీరు నమ్మే మోడీయే విమర్శించారని దానిపై ఎందుకు మాట్లాడరని పవన్ ను ప్రశ్నించారు బొత్స. రాజధాని పేరుతో చంద్రబాబు, లోకేష్ ల అవినీతి వెయ్యి కుంభకోణాలకు సమానమని.. వాటిని ప్రభుత్వం బయటపెడుతుంటే వారిని కాపాడడానికే అమరావతికి వచ్చావా? అని బొత్స ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News