టీడీపీవాళ్లు ప్రచారానికి వస్తే చెంపలు వాయించండి

ప్రజలను ఇబ్బందులు పెడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం కోసం గ్రామాల్లోకి వస్తే వారిని చొక్కా పట్టుకుని నిలదీయాలని, ఆ చెంపా ఈ చెంపా వాయించాలని అన్నారు రోజా.

Advertisement
Update: 2024-05-02 17:19 GMT

జగన్ అధికారంలో ఉంటేనే ఏ పథకమైనా ఇంటి వరకు వస్తుందని, నెల రోజులపాటు ఎన్నికల కారణంగా అధికారం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్తే టీడీపీ కుట్రల ద్వారా ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు మంత్రి రోజా. ఇంటింటికీ ఒకటో తేదీ పెన్షన్లు అందుతుంటే, అవ్వాతాతలు సీఎం జగన్ ని దీవిస్తుంటే చూసి ఓర్చుకోలేక చంద్రబాబు ఈసీకి ఫిర్యాదులు చేసి, వాలంటీర్లను పక్కనపెట్టేలా చేశారని, ఇప్పుడు వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి కారణం కేవలం చంద్రబాబేనని చెప్పారు రోజా.


వృద్ధుల అవస్థలు చంద్రబాబుకి తెలియవా అని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు వయసున్న వారు మండుటెండల్లో బ్యాంకుల వద్ద క్యూలైన్లలో మాడిపోతున్నారని చెప్పారు. అదే వయసున్న చంద్రబాబు మండుటెండలో నిలబడితే వారి పరిస్థితి ఆయనకు అర్థమవుతుందన్నారు. చంద్రబాబు మనసు లేదని, ఆయన నీఛ రాజకీయాలు, కుటిల రాజకీయాలు అందరికీ తెలుసన్నారు రోజా. 58 నెలలపాటు ప్రజలకు కష్టం లేకుండా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని ఇళ్లకు అందిస్తుంటే కక్షకట్టి చంద్రబాబు చెడగొట్టారని మండిపడ్డారు.

ప్రజలను ఇబ్బందులు పెడుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం కోసం గ్రామాల్లోకి వస్తే వారిని చొక్కా పట్టుకుని నిలదీయాలని, ఆ చెంపా ఈ చెంపా వాయించాలని అన్నారు రోజా. మే 13 జరిగే ఎన్నికల్లో కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్ అధికారంలో ఉంటేనే పథకాలన్నీ ప్రజల ఇళ్లకు వచ్చి చేరతాయని, చంద్రబాబు లాంటి వారికి అధికారం అప్పగిస్తే అన్ని పథకాలు ఆగిపోతాయని అన్నారు. నెలరోజులు అధికారం ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తేనే చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారని, అలాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడితే అరాచకమేనన్నారు రోజా. 

Tags:    
Advertisement

Similar News