రేవంత్ జైలుకు పోయేది ఆరోజే.. డేట్ చెప్పిన అర్వింద్‌

రిజర్వేషన్లపై రేవంత్‌ చేస్తున్న వ్యాఖ్యలపైనా అర్వింద్‌ స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముట్టేది లేదు, వాటిలో నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్నారు.

Advertisement
Update: 2024-05-02 15:09 GMT

ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్‌ రెడ్డి.. త్వరలోనే జైలుకు వెళ్తాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు. నిజామాబాద్‌ ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. "బ్యాగులు మోసిన కేసు దగ్గరపడింది. ఆ కేసులో జూలై 14న రేవంత్‌ రెడ్డికి డెడ్‌లైన్‌. ఈ వార్త విని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కలాంటి వాళ్లు రోజు పండుగ చేసుకుంటున్నారు. జూలై 14 ఎప్పుడు వస్తుందా?. రేవంత్ ఎప్పుడు జైలుకు వెళ్తాడు అని?" అన్నారు ధర్మపురి అర్వింద్.

కాంగ్రెస్‌ గెలిస్తే దేశం 3 ముక్కలు..

రిజర్వేషన్లపై రేవంత్‌ చేస్తున్న వ్యాఖ్యలపైనా అర్వింద్‌ స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముట్టేది లేదు, వాటిలో నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్నారు. మోడీ బతికి ఉన్నంత కాలం ఎవరూ కూడా రిజర్వేషన్లు ముట్టుకోరని స్పష్టం చేశారు. ప్రచారానికి పోతే గ్యారంటీల సంగతేంటని జనం అడుగుతారనే భయంతో రేవంత్‌రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్‌ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు అర్వింద్‌. కాంగ్రెస్‌కు ఓటేస్తే ముస్లిం రాజ్యం అయిపోయి దేశం మూడు ముక్కలవుతుందని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News