మీరెందుకు ఓడిపోయారు? " ప్రశ్నించిన లోకేష్‌

టీడీపీ ఘోర పరాజయం తరువాత చంద్రబాబు గానీ ఆ పార్టీ సీనియర్‌ నాయకులు గానీ గతంలో లాగా మీడియా ముందుకు రావడం లేదు. లోకేష్‌ కూడా ట్విట్టర్‌ ద్వారానే ఎన్నిక ఫలితాలపై స్పందించాడు. లోకేష్‌ ఇప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పార్టీ ఓటమికి కార్యకర్తలు, నేతలే బాధ్యులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గల్లా వంటి నేతలు గెలవగా […]

Advertisement
Update: 2019-05-28 01:51 GMT

టీడీపీ ఘోర పరాజయం తరువాత చంద్రబాబు గానీ ఆ పార్టీ సీనియర్‌ నాయకులు గానీ గతంలో లాగా మీడియా ముందుకు రావడం లేదు. లోకేష్‌ కూడా ట్విట్టర్‌ ద్వారానే ఎన్నిక ఫలితాలపై స్పందించాడు.

లోకేష్‌ ఇప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పార్టీ ఓటమికి కార్యకర్తలు, నేతలే బాధ్యులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

గల్లా వంటి నేతలు గెలవగా లేనిది…. మిగిలిన వారు ఎందుకు ఓడిపోయారు? అంటూ ఓడిపోయిన నాయకులను ప్రశ్నించాడు లోకేష్‌.

చంద్రబాబును మోసం చేసింది నేతలేనని ఘాటైన వ్యాఖ్యలు చేశాడు లోకేష్‌.

ఈవీఎంలు పదిశాతం మోసం చేస్తే…. కార్యకర్తలు, నాయకులు కలిసి 90 శాతం మోసం చేశారన్నారు.

Tags:    
Advertisement

Similar News