రూ. 3 కోట్లు వెనక్కు ఇచ్చేయాలని టీడీపీ అభ్యర్థి డిమాండ్

కడప జిల్లా బద్వేల్‌ టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా ఉన్న రాజశేఖర్ పోటీకి జంకుతున్నారు. కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత ఆయన పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా టికెట్‌ కోసం తాను ఇచ్చిన మూడు కోట్లు తిరిగి ఇచ్చేయాలని టీడీపీ నేతలపై ఆయన ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కావాలంటే 50లక్షలు ఉంచుకుని మిగిలిన సొమ్ము ఇవ్వాల్సింగా టీడీపీ పెద్దలను ఆయన కోరుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయజ్యోతి రెబల్‌గా నామినేషన్‌ వేయడం, కడప జిల్లాలో వైసీపీ […]

Advertisement
Update: 2019-03-23 01:38 GMT

కడప జిల్లా బద్వేల్‌ టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ అభ్యర్థిగా ఉన్న రాజశేఖర్ పోటీకి జంకుతున్నారు. కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత ఆయన పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా టికెట్‌ కోసం తాను ఇచ్చిన మూడు కోట్లు తిరిగి ఇచ్చేయాలని టీడీపీ నేతలపై ఆయన ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కావాలంటే 50లక్షలు ఉంచుకుని మిగిలిన సొమ్ము ఇవ్వాల్సింగా టీడీపీ పెద్దలను ఆయన కోరుతున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయజ్యోతి రెబల్‌గా నామినేషన్‌ వేయడం, కడప జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నేపథ్యంలో అనవసరంగా డబ్బు పొగొట్టుకోవడం మినహా ఏమీ ఉపయోగం ఉండదన్న భావనకు రాజశేఖర్‌ వచ్చారు.

అయితే రేపు బద్వేల్‌లో చంద్రబాబు బహిరంగ సభ ఉంది. ఈనేపథ్యంలో రాజశేఖర్‌ను బుజ్జగించేందుకు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News