కే ఏ పాల్‌కు షాక్‌....

కేఏ పాల్‌కు షాక్ తగిలింది. ఆయన పార్టీ గుర్తును ఈసీ హోల్డ్‌లో ఉంచింది. కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీకి ఈసీ ఇటీవల హెలికాప్టర్‌ గుర్తు కేటాయించింది. హెలికాప్టర్‌ రెక్కలు అచ్చం… వైసీపీ ఫ్యాన్ రెక్కల తరహాలోనే ఉండడంతో వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. టక్కున చూస్తే రెండు గుర్తులు ఒకేలా కనిపిస్తుండడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకున్న […]

Advertisement
Update: 2019-03-09 08:28 GMT

కేఏ పాల్‌కు షాక్ తగిలింది. ఆయన పార్టీ గుర్తును ఈసీ హోల్డ్‌లో ఉంచింది. కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీకి ఈసీ ఇటీవల హెలికాప్టర్‌ గుర్తు కేటాయించింది.

హెలికాప్టర్‌ రెక్కలు అచ్చం… వైసీపీ ఫ్యాన్ రెక్కల తరహాలోనే ఉండడంతో వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది.

టక్కున చూస్తే రెండు గుర్తులు ఒకేలా కనిపిస్తుండడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

వైసీపీ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ… హెలికాప్టర్ గుర్తును ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచుతున్నట్టు ప్రకటించింది. హెలికాప్టర్‌ గుర్తును మరొకరికి కేటాయించకుండా రద్దు చేయాలని ఈసీకి విజయసాయిరెడ్డి కోరారు.

Tags:    
Advertisement

Similar News