జగన్‌ మీద కోపానికి కారణం అదా?

ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం కన్నా ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటున్నాడు పవన్ కల్యాణ్. ఒక రోజు కాదు…. ప్రతి రోజూ జగన్ మీదే యుద్ధం ప్రకటిస్తున్నాడు జనసేన అధినేత. పవన్ ఇంతకీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి హోదాలోని బాబును ప్రశ్నించడం కన్నా జగన్ ను ఎందుకు ఎక్కువగా కెలుకుతున్నాడు అంటే…. దీని వెనుక ఆసక్తిదాయకమైన విషయాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ […]

Advertisement
Update: 2018-11-26 20:55 GMT

ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకోవడం కన్నా ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటున్నాడు పవన్ కల్యాణ్. ఒక రోజు కాదు…. ప్రతి రోజూ జగన్ మీదే యుద్ధం ప్రకటిస్తున్నాడు జనసేన అధినేత.

పవన్ ఇంతకీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి హోదాలోని బాబును ప్రశ్నించడం కన్నా జగన్ ను ఎందుకు ఎక్కువగా కెలుకుతున్నాడు అంటే…. దీని వెనుక ఆసక్తిదాయకమైన విషయాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ చేయించుకున్న అంతర్గత సర్వేలు.

పవన్ కల్యాణ్ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పవన్ ప్రత్యేకంగా సర్వేలు చేయించుకున్నాడట. వాటిల్లో తేలింది ఏమిటంటే ఈ ప్రాంతంలో జగన్ హవా సుస్పష్టంగా ఉంది.

పవన్ కల్యాణ్ కేవలం ఆ ప్రాంతం చుట్టూరానే తిరుగుతున్నా…. ఎడ్జ్ మాత్రం జగన్ కే ఉంది. తెలుగుదేశం వ్యతిరేక ఓట్లు పవన్ వైపు రావడం లేదు.

అవి జగన్ వైపే వెళ్తున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ జగన్ మీద కాన్సన్ ట్రేట్ చేశాడు. జగన్ నే లక్ష్యంగా చేసుకుంటున్నాడు.

తను అంతగా తిరుగుతున్నా జనాలు తన వైపు చూడకుండా…. జగన్ వైపు మొగ్గు చూపుతుండే సరికి పవన్ కల్యాణ్ కు అసహనం పెరిగిపోతూ ఉందని సమాచారం.

ఇలాంటి నేపథ్యంలో ఈ అసహనాన్ని పవన్ ఈ విధంగా చాటుతున్నాడని తెలుస్తోంది. జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు. ఆఖరికి జగన్ కులం విషయంలో కూడా పవన్ రాళ్లేస్తున్నాడు. ఏదో విధంగా రచ్చ రేపి.. తన కులం వాళ్లను అయినా తన వైపు మళ్లించుకోవడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నాడని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News