వాళ్లు ఇంకెంత ఎగరాలి?- రియో మెడల్స్‌పై వర్మ ఘాటు సెటైర్లు

వర్మ వెర్రివాడిలా కనిపిస్తాడు చాలా మందికి. కానీ అతడి విమర్శను ధైర్యంగా స్వీకరించి ఆలోచిస్తే చాలా లోతు ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. తాజాగా రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు మెడల్స్ రాగానే మనవాళ్లు చేస్తున్న హడావుడిపై వర్మ ఎప్పటిలాగే తన మనసులో మాటను ట్వీట్ చేశారు. ”32 కోట్ల జనాభా  ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు వచ్చాయి, 5 కోట్ల జనాభా  ఉన్న దక్షిణ కొరియాకు 9 బంగారు పతకాలు వచ్చాయి. 120 కోట్ల జనాభా […]

Advertisement
Update: 2016-08-21 23:26 GMT

వర్మ వెర్రివాడిలా కనిపిస్తాడు చాలా మందికి. కానీ అతడి విమర్శను ధైర్యంగా స్వీకరించి ఆలోచిస్తే చాలా లోతు ఉన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. తాజాగా రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు మెడల్స్ రాగానే మనవాళ్లు చేస్తున్న హడావుడిపై వర్మ ఎప్పటిలాగే తన మనసులో మాటను ట్వీట్ చేశారు. ”32 కోట్ల జనాభా ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు వచ్చాయి, 5 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాకు 9 బంగారు పతకాలు వచ్చాయి. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం రాగానే మేరా భారత్ మహాన్ అని అరుస్తూ పైకి కిందకు ఎగురుతున్నాం. మరి 46 బంగారు, 37 వెండి పతకాలు వచ్చిన అమెరికావాళ్లు ఇంకెంత ఎగరాలి” అని సెటైర్లు వేశారు వర్మ.

https://twitter.com/RGVzoomin/status/767567153931354113

https://twitter.com/RGVzoomin/status/767565018502164480

 

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News