సీఎం సతీమణి ప్రచారం.. టీడీపీ విష ప్రచారం

పులివెందులలో సీఎం జగన్ సతీమణి భారతీ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీని గెలిపించాలని, సంక్షేమ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని చెబుతున్నారు.

Advertisement
Update: 2024-05-07 05:03 GMT

కుప్పంలో భువనేశ్వరి ప్రచారం చేస్తే.. ఆహా ఓహో

మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం చేస్తే.. భర్తకు చేదోడు

హిందూపురానికి బాలయ్య కుటుంబం వస్తే.. నందమూరి సందడి

పిఠాపురంలో మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగితే.. అది మెగా ఫ్యామిలీ ప్యాక్

కానీ పులివెందులలో జగన్ సతీమణి భారతీ రెడ్డి ప్రచారం చేస్తే మాత్రం దానికి 'ఓటమి భయం' అనే ట్యాగ్ లైన్ అంటగట్టారు. ఇదీ ఎల్లో మీడియా చేస్తున్న విషప్రచారం.

పులివెందులలో సీఎం జగన్ సతీమణి భారతీ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీని గెలిపించాలని, సంక్షేమ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఈ ప్రచారం ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. పులివెందులలో వైసీపీకి పరిస్థితి అనుకూలంగా లేదని, అందుకే భారతీ రెడ్డి ప్రచారం చేస్తున్నారంటూ కడుపుమంట వార్తలు రాస్తోంది. గతంలో భారతి ప్రచారం చేసినా కూడా ఆయా ప్రాంతాల్లో సభలతోనే సరిపెట్టేవారని, ఈసారి మాత్రం ఇంటింటికీ వెళ్తున్నారని, అంటే వారిలో ఓటమి భయం ఉందని ఎల్లో విశ్లేషణలో చెప్పుకొచ్చారు.

గడప గడపకు అనేది వైసీపీ వ్యూహం. ఎమ్మెల్యేలందర్నీ ఈసారి ప్రతి ఇంటికీ పంపించారు సీఎం జగన్. గడప గడపకు మనద్వారా జరిగిన మంచిని వివరించాలని చెప్పారు. పులివెందులలో కూడా సీఎం సతీమణి భారతీ రెడ్డి అలాగే ప్రచారం చేస్తున్నారు. అయితే ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం మొదలు పెట్టింది.  

Tags:    
Advertisement

Similar News