టీజీకి యానాం కావాలట...

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందిగా జనం కోరుతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కొత్త డిమాండ్ చేశారు. రాజకీయ లబ్దికోసం కేవీపీ ప్రైవేట్ బిల్లు పెడితే సరిపోదని.. కేంద్రపాలిత ప్రాంతం యానాంను ఏపీలో కలిపేందుకు ముందుకొస్తే అప్పుడు కాంగ్రెస్‌ చిత్తశుద్దిని నమ్ముతామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తాము బీజేపీతో యుద్ధం చేయలేమని తేల్చేశారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటామని చెప్పారు. హోదాసాధించే […]

Advertisement
Update: 2016-07-22 09:44 GMT

ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందిగా జనం కోరుతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కొత్త డిమాండ్ చేశారు. రాజకీయ లబ్దికోసం కేవీపీ ప్రైవేట్ బిల్లు పెడితే సరిపోదని.. కేంద్రపాలిత ప్రాంతం యానాంను ఏపీలో కలిపేందుకు ముందుకొస్తే అప్పుడు కాంగ్రెస్‌ చిత్తశుద్దిని నమ్ముతామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తాము బీజేపీతో యుద్ధం చేయలేమని తేల్చేశారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటామని చెప్పారు. హోదాసాధించే బలం వెంకయ్యనాయుడుకి లేదన్నారు టీజీ. కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తేనే జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తామని బీజేపీకి కాంగ్రెస్ తేల్చిచెప్పాలని టీజీ డిమాండ్ చేశారు. అయినా చట్టంలో ఉన్నవి సాధించండి బాబూ అని జనం మొత్తుకుంటుంటే ఏకంగా యానాం కావాలంటూ డిమాండ్ చేయడం పెద్ద సాహసమే. అది టీడీపీకే సాధ్యం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News