వైసీపీ ఒక ఐస్ క్రీం... మంత్రులు దద్దమ్మలు

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అటు టీడీపీని, ఇటు వైసీపీని విమర్శించారు. కేంద్ర కేబినెట్ తీర్మానంతో ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని… ఇందుకు చట్టం చేయాల్సిన పని లేదన్నారు. హోదాపై చంద్రబాబు, వెంకయ్యనాయుడు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని రఘువీరా విమర్శించారు. ఏపీ మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాకోసం కేవీపీ ప్రవేశపెడుతున్న బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ పార్టీ ఒక ఐస్‌ క్రీం […]

Advertisement
Update: 2016-07-18 02:13 GMT

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అటు టీడీపీని, ఇటు వైసీపీని విమర్శించారు. కేంద్ర కేబినెట్ తీర్మానంతో ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని… ఇందుకు చట్టం చేయాల్సిన పని లేదన్నారు. హోదాపై చంద్రబాబు, వెంకయ్యనాయుడు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని రఘువీరా విమర్శించారు. ఏపీ మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదాకోసం కేవీపీ ప్రవేశపెడుతున్న బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. జగన్ పార్టీ ఒక ఐస్‌ క్రీం లాంటిదన్నారు రఘువీరా. అది కరిగిపోతుందన్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి ఇంటి దొంగలే ద్రోహం చేశారని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఉన్నతమైన పదవులు అనుభవించిన వారు కూడా పార్టీని వీడివెళ్లడం సిగ్గుచేటన్నారు రఘువీరారెడ్డి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News