గడ్డం శపథం తీరకముందే... మరో శపథం చేసిన సతీష్ రెడ్డి

టీడీపీ నేత, మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి ఏడాదిన్నరగా గడ్డం పెంచుకుని తిరుగుతున్నారు. అధికారం చేపట్టిన వెంటనే కడపకు వచ్చిన చంద్రబాబు… నెలల వ్యవధిలోనే గండికోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు మాటలు నమ్మిన సతీష్ రెడ్డి… గండికోటకు నీరు వచ్చేవరకు గడ్డం, తల నీలాలు తీయనని శపథం చేశారు. అదిచేసి ఏడాదిన్నర దాటింది. అయితే గండికోటకు నీరు రాలేదు. ఆయన గడ్డం తీయడం లేదు. అయితే తాజాగా సతీష్ రెడ్డి మరో […]

Advertisement
Update: 2016-06-08 04:15 GMT

టీడీపీ నేత, మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి ఏడాదిన్నరగా గడ్డం పెంచుకుని తిరుగుతున్నారు. అధికారం చేపట్టిన వెంటనే కడపకు వచ్చిన చంద్రబాబు… నెలల వ్యవధిలోనే గండికోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు మాటలు నమ్మిన సతీష్ రెడ్డి… గండికోటకు నీరు వచ్చేవరకు గడ్డం, తల నీలాలు తీయనని శపథం చేశారు. అదిచేసి ఏడాదిన్నర దాటింది. అయితే గండికోటకు నీరు రాలేదు. ఆయన గడ్డం తీయడం లేదు. అయితే తాజాగా సతీష్ రెడ్డి మరో శపథం చేశారు. జిల్లాలో ప్రాజెక్టులుపూర్తయ్యే వరకు మాంసాహారం ముట్టుకోనని సింహాద్రిపురం నవనిర్మాణ దీక్షలో ప్రకటించారు. ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో సతీష్ రెడ్డి గడ్డం తీసి గ్లామర్‌గా ఎప్పుడు కనిపిస్తారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News