వైసీపీ ఎమ్మెల్యేకి రాయపాటి ఆహ్వానం, హామీ

గుంటూరు  తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాను టీడీపీలోకి రావాల్సిందిగా నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు  ఆహ్వానించారు. టీడీపీలోకి వస్తే అన్ని తాను చూసుకుంటానని రాయపాటి హామీ ఇచ్చారు. వచ్చే  ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పిస్తానని తనను కలిసిన ముస్తఫాతో చెప్పారు.  అయితే రాయపాటి ప్రతిపాదనపై ముస్తఫా మౌనంగా ఉండిపోయారు.  మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌కు  కేంద్రం నుంచి నిధులు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని రాయపాటి ఆరోపించారు. పోలవరం నిర్మాణ పనులు ఆగిపోలేదని.. నెమ్మదిగా సాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే […]

Advertisement
Update: 2016-04-03 01:23 GMT

గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాను టీడీపీలోకి రావాల్సిందిగా నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆహ్వానించారు. టీడీపీలోకి వస్తే అన్ని తాను చూసుకుంటానని రాయపాటి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పిస్తానని తనను కలిసిన ముస్తఫాతో చెప్పారు. అయితే రాయపాటి ప్రతిపాదనపై ముస్తఫా మౌనంగా ఉండిపోయారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని రాయపాటి ఆరోపించారు. పోలవరం నిర్మాణ పనులు ఆగిపోలేదని.. నెమ్మదిగా సాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ఏపీ కేబినెట్ లో ముస్లిం వ్యక్తికి చోటు దక్కుతుందని శనివారం చంద్రబాబు ప్రకటించారు. ఇంతలోనే రాయపాటి, ముస్తఫా భేటీ చర్చనీయాంశమైంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News