రావెలకు గోతులు తవ్వింది ఆ టీడీపీ మంత్రులేనా?

టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్ మహిళను వేధించిన కేసులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు  టీడీపీ మంత్రులే రావెల కుమారుడిని అల్లరి చేశారని చెప్పుకుంటున్నారు. అంతా కామ్ అయిపోయిన వేళ మంత్రులే మీడియాకు లీకులిచ్చారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. గురువారం సాయంత్రం రావెల సుశీల్ మహిళను వేధించారు. స్పాట్‌లోనే స్థానికులు సుశీల్, అతడి డ్రైవర్‌ను చితక్కొట్టారు.  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రావెల సుశీల్ ఈ ఘనకార్యం చేసినట్టు […]

Advertisement
Update: 2016-03-06 23:12 GMT

టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్ మహిళను వేధించిన కేసులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు టీడీపీ మంత్రులే రావెల కుమారుడిని అల్లరి చేశారని చెప్పుకుంటున్నారు. అంతా కామ్ అయిపోయిన వేళ మంత్రులే మీడియాకు లీకులిచ్చారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

గురువారం సాయంత్రం రావెల సుశీల్ మహిళను వేధించారు. స్పాట్‌లోనే స్థానికులు సుశీల్, అతడి డ్రైవర్‌ను చితక్కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రావెల సుశీల్ ఈ ఘనకార్యం చేసినట్టు శుక్రవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. ఇలా ఒక రోజు పాటు విషయం బయటకు పొక్కకపోవడం వెనుక రావెల నడిపిన లాబీయింగే కారణమని కథనాలు వస్తున్నాయి. టీడీపీ నుంచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఒక ముఖ్య నేత సాయంతో కేసు నుంచి కొడుకును తప్పించేందుకు రావెల ప్రయత్నించారట. ఆ విషయంలో ఆయన తొలుత విజయం సాధించారని కూడా చెబుతున్నారు. అయితే రావెల అంటే గిట్టని కొందరు టీడీపీ నేతలు మీడియాకు లీక్‌లిచ్చారట. రావెల కుమారుడు చేసిన పని మీకు తెలియదా అని మీడియా ప్రతినిధులను అమాయకంగా ప్రశ్నించి మరీ అసలు విషయం చెప్పారట. అంతే క్షణాల్లో మొత్తం టీవీ చానళ్లు రావెలను ఆడుకోవడం మొదలుపెట్టాయట.

రావెల మీడియాలోగానీ, పనితీరులో గానీ తమను డామినేట్ చేస్తున్నారన్న భావన రెండు జిల్లాలకు చెందిన మంత్రుల్లో ఉందని చెబుతున్నారు. అందుకే రావెలను దెబ్బకొట్టేందుకు వారు ఇలా సుశీల్ అంశాన్ని వాడుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం రావెలకు తెలిసినా సొంత పార్టీ నేతలను ఏమీ చేయలేక ఆ కోపమంతా జగన్‌పై చూపించారని మీడియా కథనాలు.

Click on image to read:

 

 

 

Tags:    
Advertisement

Similar News