మక్కా యాత్రకు వెళ్లిన దంపతులు మృతి

సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో క్రేన్‌ కూలిన దుర్ఘటనలో కృష్ణాజిల్లా మచిలీపట్టణానికి చెందిన దంపతులు మృతి చెందారు. ఈ విషయాన్ని తమకు సౌదీ ప్రభుత్వం తెలిపిందని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంగ్లీషుపాలేనికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ (38), ఫాతిమాబేగం (34) ఈనెల 4న మచిలీపట్నం నుండి మక్కాకు బయలుదేరి వెళ్లారు. 11న మక్కాలో ఇసుక తుపాను వచ్చి ఓ క్రేన్‌ మసీదుపై పడిన ఘటనలో 107 మంది చనిపోయారు. వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారు. ముందు […]

Advertisement
Update: 2015-09-14 01:53 GMT
సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో క్రేన్‌ కూలిన దుర్ఘటనలో కృష్ణాజిల్లా మచిలీపట్టణానికి చెందిన దంపతులు మృతి చెందారు. ఈ విషయాన్ని తమకు సౌదీ ప్రభుత్వం తెలిపిందని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంగ్లీషుపాలేనికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ (38), ఫాతిమాబేగం (34) ఈనెల 4న మచిలీపట్నం నుండి మక్కాకు బయలుదేరి వెళ్లారు. 11న మక్కాలో ఇసుక తుపాను వచ్చి ఓ క్రేన్‌ మసీదుపై పడిన ఘటనలో 107 మంది చనిపోయారు. వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారు. ముందు ఈ సంఘటనలో వీరు గాయపడినా ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది.
Tags:    
Advertisement

Similar News