8వ రౌండ్ లోనూ టీఆరెస్ ఆధిక్యం

మునుగోడు ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ టీఆరెస్ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 8వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆరెస్ బీజేపీ కన్నా 3285 ఓట్ల ఆధిక్యతలో ఉన్నది.

Advertisement
Update: 2022-11-06 08:43 GMT

మునుగోడు ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఫలితాల్లో టీఆరెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. మొదటి రౌండ్ లో టీఆరెస్ పూర్తి ఆధిక్యతను సాధించగా రెండవ‌, మూడవ రౌండ్స్ లో బీజేపీ కొద్దిగా ఆధిక్యత సాధించింది. నాలుగవ రౌండ్ నుంచి 8వ‌ రౌండ్ పూర్తయ్యే వరకు టీఆరెస్ పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తోంది.

8వ రౌండ్లో బీజేపి కన్నా టీఆరెస్ కు 536 ఓట్లు అధికంగా వచ్చాయి. దాంతో మొత్తం టీఆరెస్ కు 3285 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇంకా 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News