కనిపించని ఆ నాలుగో సింహం సీఎం కేసీఆర్..

తెలంగాణ ఏర్పడిన వెంటనే షీ టీమ్స్‌ ఏర్పాటు చేశారని, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే తాట తీస్తామన్న సందేశాన్ని ఇచ్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.

Advertisement
Update: 2023-06-04 15:35 GMT

రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న పోలీసులు మూడు సింహాలైతే కనిపించని ఆ నాలుగో సింహమే సీఎం కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని ముందుకు నడిపించే నాలుగో సింహం ఆయన అని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ లో హోంశాఖ నిర్వహించిన మహిళా సురక్ష కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇచ్చే మంచి సంస్కృతి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని మహిళల భద్రత బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకున్నారని చెప్పారు.


తెలంగాణ ఏర్పడిన వెంటనే షీ టీమ్స్‌ ఏర్పాటు చేశారని, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే తాట తీస్తామన్న సందేశాన్ని ఇచ్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని 18 రాష్ట్రాలు షీ టీమ్స్‌ ను ఏర్పాటు చేయడం గర్వకారణం అని అన్నారు. తెలంగాణ విడిపోతే నక్సలైట్ల రాజ్యం, రౌడీ రాజ్యం అవుతుందని, మతకల్లోలాలు జరుగుతాయని కొందరు అవహేళనగా మాట్లాడారని, ఆ మాటలన్నీ ఇప్పుడు పటాపంచలయ్యాయని చెప్పారు.

తొమ్మిదేళ్లలో నో కర్ఫ్యూ, నో కల్లోలం..

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదని, ఒక్క చోట కూడా మతకల్లోలాలు జరగలేదని వివరించారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్న కారణంగానే పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్లలు ధైర్యంగా రోడ్లపై నడిచివెళ్లే పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్ లో 100 నెంబర్‌ కు ఫోన్ చేస్తే 7 నిమిషాల్లోనే పోలీసులు స్పాట్ కి వస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో 14వ నిమిషంలోపే పోలీసులు బాధితుల వద్దకు చేరుకుంటారని వివరించారు. పోలీసులకు ప్రజల తరపున అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు కవిత. 

Tags:    
Advertisement

Similar News