ఫేకుడు మాని పని చూడు.. కిషన్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

"గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు. మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి." అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ కి బదులిచ్చారు కేటీఆర్.

Advertisement
Update: 2023-03-11 16:10 GMT

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రమేయం ఎంత అనేది తెలంగాణ వాసులకు బాగా తెలుసు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మోకాలడ్డడానికి చివరి నిమిషం వరకు బీజేపీ ప్రయత్నించిన విషయం కూడా తెలుసు. ఇక ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత మాత్రం కాంగ్రెస్ కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేయాలని చూసింది బీజేపీ. బీజేపీ నేతలు తెలంగాణ ఉద్యమాన్నంతా తామే ముందుండి నడిపించినట్టు బిల్డప్ ఇస్తుంటారు. ఈ క్రమంలో మిలియన్ మార్చ్ జరిగి 12 ఏళ్లవుతున్న సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ ఓ ట్వీట్ వేశారు. దానికి మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?

"తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన "మిలియన్ మార్చ్" నిర్వహించి పుష్కరకాలం గడిచింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ అనేక నిర్బంధాలను, అడ్డంకులను, అరెస్టులను అధిగమించి లక్షలాదిమంది ప్రజలతో నిర్వహించిన నాటి మిలియన్ మార్చ్ నేటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉంది." అంటూ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి.


దీనికి కేటీఆర్ ఇలా కౌంటర్ ఇచ్చారు. "తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం? తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు. మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి." అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ కి బదులిచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ శ్రేణులు కూడా కిషన్ రెడ్డికి కౌంటర్లు మొదలు పెట్టాయి. కుర్ కురే రెడ్డి అలియాస్ లిఫ్ట్ రెడ్డి అంటూ కిషన్ రెడ్డిని ఆటాడేసుకున్నారు. మిలియన్ మార్చి విషయంలో ట్వీట్ వేసి మరీ ట్రోలింగ్ కి గురయ్యారు కిషన్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News