Hyderabad: సంగారెడ్డిలోని ఓ కంపెనీలో అగ్నిప్రమాదం - ముగ్గురు కార్మికుల సజీవ దహనం

సంగారెడ్డి గడ్డిపోతారం లో ఉన్న 'మైలాన్' అనే కంపెనీ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న పరితోష్, రంజిత్ కుమార్, లోకేశ్వర రావు అనే ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందినట్టు సమాచార‍ం.

Advertisement
Update: 2023-01-08 10:24 GMT

హైదరాబాద్ శివారుల్లోని సంగారెడ్డిలో ఓ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదం లో ముగ్గురు కార్మికులు సజీవదహనం కాగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

సంగారెడ్డి గడ్డిపోతారం లో ఉన్న 'మైలాన్' అనే కంపెనీ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఏపీ శ్రీకాకుళం వాసి లోకేశ్వర్‌రావు (38), బెంగాల్‌ వాసి పరితోష్‌ మెహత (40), బిహార్‌ వాసి రంజిత్‌కుమార్‌ (27) లు మృతి చెందినట్టు సమాచార‍ం.పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News