బీజేపీని లేకుండా చేయడం కోసమే బీఆరెస్ తో దోస్తీ...సీపీఎం నేత తమ్మినేని

మతోన్మాద బీజేపీ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగుర వేయాలని ఎత్తుగడలు వేస్తున్నదని, వారి ఆటలు తెలంగాణలో సాగనివ్వబోమన్నారు తమ్మినేని.

Advertisement
Update: 2023-03-22 06:40 GMT

దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడం కోసమే భారత రాష్ట్ర సమితి తో చేతులు కలిపామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సీపీఎం జనచైతన్య యాత్రలో భాగంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్‌, జూలూరుపాడు మండల కేంద్రాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు.

మతోన్మాద బీజేపీ దేశంలోని అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని, దేశంలో ప్రాథమిక హక్కులను కూడా హరిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నదని తమ్మినేని ఆరోపించారు. తన స్నేహితులైన అదానీ లాంటి వాళ్ళకు దేశ సంపదను దోచిపెట్టిందని ఇలాంటి పార్టీ ఇంకా దేశాన్ని పరిపాలిస్తే ప్రజల జీవితాలు అల్లకల్లోలమవుతాయని, అందుకే బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా దేశం అంతా ఒక్కటై పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.

మతోన్మాద బీజేపీ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగుర వేయాలని ఎత్తుగడలు వేస్తున్నదని, వారి ఆటలు తెలంగాణలో సాగనివ్వబోమన్నారు తమ్మినేని. బీజేపీ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లో ప్రచారం చేయడం కోసమే జనచైతన్య యాత్ర చేస్తున్నామన్నారు.

Tags:    
Advertisement

Similar News