బోయినపల్లి అభిషేక్ అరెస్ట్

హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్ల‌య్ స్థాపించిన రాబిన్ డిస్టలరీస్‌లో బోయినపల్లి డైరెక్టర్‌గా ఉండటంతో సీబీఐ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు.

Advertisement
Update: 2022-10-10 04:12 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక అరెస్ట్‌ జరిగింది. ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన అరెస్ట్‌ల పర్వం తాజాగా హైదరాబాద్‌కు తాకింది. బోయినపల్లి అభిషేక్‌రావును సీబీఐ అరెస్ట్ చేసింది. రాబిన్ డిస్టలరీస్‌లో ఈయన డైరెక్టర్‌గా ఉన్నారు. బోయినపల్లి అభిషేక్ అనూస్‌ బ్యూటీ పార్లర్‌ అధినేత కూడా.

హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్ల‌య్ స్థాపించిన రాబిన్ డిస్టలరీస్‌లో బోయినపల్లి డైరెక్టర్‌గా ఉండటంతో సీబీఐ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. డబ్బు లావాదేవీల్లో అభిషేక్‌ కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. అభిషేక్ పెట్టుబడులపైనా ఆరా తీసే క్రమంలో రెండు రోజుల క్రితం ఆంధ్రప్రభ పత్రికా కార్యాలయంలోనూ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రభలో అభిషేక్ పెట్టుబడులు పెట్టినట్టు సీబీఐ, ఈడీ అనుమానిస్తున్నాయి.

మున్ముందు మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాత్రి అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్‌ను నేడు కోర్టులో ప్రవేశపెట్టనుంది సీబీఐ.

Tags:    
Advertisement

Similar News