షూటింగ్ లో ఆక్సిడెంట్ .. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు

హీరో విశాల్ కు ప్రమాదం జరిగింది. ఓ మూవీ షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన గాయపడ్డారు.

Advertisement
Update: 2022-08-11 07:36 GMT

'మార్క్ ఆంటోనీ' సినిమా షూటింగ్ లో నటుడు విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. గురువారం చెన్నైలో ఈ మూవీకి సంబంధించి సెట్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన గాయపడినట్టు ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాల ట్వీట్ చేశారు.



విశాల్ ని వెంటనే ఆసుపత్రికి తరలించి షూటింగ్ నిలిపివేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. విశాల్ ఇలా సెట్స్ లో గాయపడడం ఇదే మొదటిసారి కాదని, లోగడ తన 'లాఠీ' మూవీ చిత్రీకరణ సందర్భంగా కూడా ఆయన గాయపడ్డాడని రమేష్ బాల తెలిపారు. 'మార్క్ ఆంటోనీ' చిత్రంలో ఎస్.జె. సూర్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో విశాల్, సూర్య ఇద్దరూ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

రీతూ వర్మ, సునీల్ వర్మ, నిళల్ గల్ రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న మార్క్ ఆంటోనీ చిత్రానికి వినోద్ కుమార్ ప్రొడ్యూసర్ కాగా .దర్శకుడు అధిక్ రవిచంద్రన్.. ..పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ తో సాగే ఈ చిత్రం షూటింగ్ గత మేలో ప్రారంభమైంది. 

Tags:    
Advertisement

Similar News