Veerasimha Reddy: మొదటి రోజు మెరిసిన బాలయ్య సినిమా

Veerasimha Reddy : బాలకృష్ణ సినిమా మొదటి రోజు మెరిసింది. కొత్త రికార్డ్స్ సృష్టించింది

Advertisement
Update: 2023-01-13 16:08 GMT

బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ ఏకంగా 54 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్ ఇది.


ఇప్పటివరకు బాలయ్య నటించిన ఏ సినిమాకు మొదటి రోజు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. అఖండ సినిమా హిట్టవ్వడం, వీరసింహారెడ్డి సంక్రాంతి సినిమా కావడంతో.. ఈసారి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇవన్నీ ఒకెత్తయితే, సంక్రాంతి సీజన్ లో మొదటి పెద్ద సినిమాగా వీరసింహారెడ్డికి భారీ స్థాయిలో థియేటర్లు దక్కాయి. అందుకే ఓపెనింగ్స్ కళ్లుచెదిరాయి.


ఇక తెలుగు రాష్ట్రాల్లో వీరసింహారెడ్డి సినిమాకు 23 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. ఏపీ,నైజాంలో వీరసింహారెడ్డికి మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి


నైజాం - 5.21 కోట్లు

సీడెడ్ - 5.55 కోట్లు

ఉత్తరాంధ్ర - 2.53 కోట్లు

ఈస్ట్ - 1.73 కోట్లు

వెస్ట్ - 2.08 కోట్లు

గుంటూరు - 3.40 కోట్లు

నెల్లూరు - 1.20 కోట్లు

కృష్ణా - 1.65 కోట్లు

Tags:    
Advertisement

Similar News