Pooja Hegde: సగం సగం వద్దంటున్న పూజా హెగ్డే

Pooja Hegde: రామ్ చరణ్ తో ఫుల్ లెంగ్త్ మూవీ చేయాలని ఉందంటోంది పూజాహెగ్డే. ఆమె ఈ స్టేట్ మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి?

Advertisement
Update: 2023-04-27 05:48 GMT

Pooja Hegde: సగం సగం వద్దంటున్న పూజా హెగ్డే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్  పూజా హెగ్డే. మహేష్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే చరణ్ తో మాత్రం తనకు ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. నిజానికి రామ్ చరణ్ తో పూజా హెగ్డే నటించింది. కానీ తక్కువ లెంగ్త్ లో చేసింది.


రంగస్థలం సినిమాలో చరణ్ తో కలిసి ఐటెంసాంగ్ చేసింది పూజ. మెగాపవర్ స్టార్ తో కలిసి పనిచేయడం పూజా హెగ్డేకు అదే తొలిసారి. అది కేవలం ఐటెంసాంగ్ తోనే అయిపోయింది.

ఆ తర్వాత ఆచార్య సినిమాలో చరణ్ తో కలిసి నటించింది పూజాహెగ్డే. అందులో కూడా ఆమెది ఫుల్ లెంగ్త్ కాదు. ఎందుకంటే అందులో ఆల్రెడీ చిరంజీవి ఉన్నారు. దీంతో పూజాహెగ్డే పాత్ర నిడివి తగ్గిపోయింది.

ఇక తాజాగా వచ్చిన కిసీకీ జాన్ కిసీకో భాయ్ సినిమాలో చరణ్ తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసింది. ఇందులో పూజాహెగ్డే ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది కానీ చరణ్ మాత్రం పాట కోసం ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.

దీంతో ప్రతిసారి చరణ్ ను మిస్సవుతున్నానని, ఈసారి ఇలా సగం సగం కాకుండా.. చరణ్ తో ఫుల్ లెంగ్త్ మూవీ చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది ఈ బ్యూటీ.

Tags:    
Advertisement

Similar News