ఎమ్మెల్సీ పీఏపై హత్యాయత్నం

కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గీయుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. నియోజవర్గంలో ఇటీవల చంద్రబాబు పర్యటించిన తరువాత ఈ ఆగడాలు మరింత పెచ్చరిల్లాయి.

Advertisement
Update: 2022-09-01 07:44 GMT

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేష్ పై హత్యాయత్నం జరిగింది. స్థానిక ఒక హోటల్లో ఆయనపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని తొలుత కుప్పం ఏరియా ఆస్పత్రికి, తరువాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. తలకు 14 కుట్లు పడిన ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు లలిత భర్త అయిన మురుగేష్ పై తెలుగుదేశం వర్గీయులు హత్యాయత్నం చేసినట్లు తెలిసింది.

ఇటీవల కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గీయుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. నియోజవర్గంలో ఇటీవల చంద్రబాబు పర్యటించిన తరువాత ఈ ఆగడాలు మరింత పెచ్చరిల్లాయి. చంద్రబాబు ప్రసంగాల్లో కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వారికి మరింత ఊతం ఇచ్చినట్లు అయింది. బాబు పర్యటన అనంతరం రోజూ ఏదో ఒక చోట విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న తెలుగుదేశం వర్గీయులు ఇప్పుడు హత్యాయత్నానికి కూడా తెగబడ్డారు.

Tags:    
Advertisement

Similar News