రుషికొండను బోడికొండ అంటావా బోడి వెధవ..

పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు లాంటి వాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. తీసేసిన వాలంటీర్ హత్య చేస్తే దానిపై రాద్ధాంతం ఏంటని ప్రశ్నించారు.

Advertisement
Update: 2023-08-12 15:12 GMT

విశాఖ ప్రజలను అవమానపరిచే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి రోజా. రుషి కొండను బోడి కొండ అని బోడి వెధవలు ప్రచారం చేస్తున్నారి మండిపడ్డారు. రుషికొండలో ఏం అక్రమాలు జరిగాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టులు కూడా రుషికొండ నిర్మాణాలకు వ్యతిరేకంగా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు మంత్రి రోజా. అక్కడ జరిగే ప్రతి నిర్మాణం గురించి కోర్టుకు చెబుతున్నామని, అసలు రుషికొండ విషయంలో పవన్ కి ఉన్న బాధ ఏంటని ప్రశ్నించారు రోజా .

నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేం బాధ అని పవన్ ని ప్రశ్నించారు మంత్రి రోజా. రుషికొండపై రామానాయుడు స్టూడియోతో పాటు ఇంకా అనేక కట్టడాలు ఉన్నాయని, అవి పవన్ కి కనిపించడం లేదా అని అడిగారు. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఇల్లు కొండపైనే ఉంది కదా అని లాజిక్ తీశారు. కొండలపై కట్టడాలు ఉండకూడదనేది అజ్ఞానం అని చెప్పారు. రుషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడుకి చెందిన గీతం యూనివర్శిటీ భూ కబ్జాల గురించి పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

ఆటలో అరటి పండు

పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండులాంటి వాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. తీసేసిన వాలంటీర్ హత్య చేస్తే దానిపై రాద్ధాంతం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ చంద్రబాబుకు చెప్పిన పవన్, ఇప్పుడు అమిత్ షా కి చెబుతారంట అని వెటకారం చేశారు. ఏపీలో కనీసం ఇల్లు కూడా లేని వ్యక్తులు జగన్ ఇల్లు గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు రోజా. తాము కోర్టు మాటలకు కట్టుబడి నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ లో పవన్ గురించి చాలా మాటలు చెప్పారని, ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. వైజాగ్ లో రాజధాని రాకూడదని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు రోజా. 

Tags:    
Advertisement

Similar News