కోడలి తలతో పోలీస్ స్టేషన్‌కు అత్త

గురువారం మరోసారి వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అత్త సుబ్బమ్మ.. కోడలు వసుంధర(35) తల నరికేసింది.

Advertisement
Update: 2022-08-11 14:32 GMT

అత్తా కోడళ్ల మధ్య గొడవలు సహజమే. ప్రతి ఇంట్లో ఇది నిత్యం ఉండే తంతే. అన్యోన్యంగా ఉండేవాళ్లు లేకపోలేదు కానీ.. గొడవలు పెట్టుకొనే వాళ్లే ఎక్కువే. అయితే ఓ ఇంట్లో ఇలా మొదలైన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ అత్త తన కొడలి తలను నరికేసింది. ఆ తలను ఓ కవర్ లో వేసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కోడలి తల నరికి దానిని కవర్ లో పెట్టుకుని వచ్చిన ఆ మహిళను చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపేట రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రామాపురానికి చెందిన సుబ్బమ్మ, వసుంధరలు అత్తాకోడళ్లు. చాలా రోజులుగా అత్తాకోడళ్లకు పడటం లేదు. వీరిద్దరూ నిత్యం ఏదో ఒక విషయంపై ఘర్షణ పడుతూనే ఉంటారు. ఇదిలా ఉంటే గురువారం మరోసారి వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన అత్త సుబ్బమ్మ.. కోడలు వసుంధర(35) తల నరికేసింది.

అనంతరం తలను ఒక పాలిథిన్ కవర్‌లో చుట్టి దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కోడలి తల నరికిన అత్త ఆ తలను పట్టుకొని ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Tags:    
Advertisement

Similar News