యాంకర్ కు చోటిచ్చిన రవితేజ

తన కొత్త సినిమాలో యాంకర్ అనసూయకు చోటిచ్చాడు మాస్ రాజా రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఖిలాడీ అనే సినిమాలో అనసూయ కూడా కనిపించబోతోంది. అయితే ఆమె హీరోయిన్ కాదు. ఈ సినిమాలో హీరోయిన్లను ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఫస్ట్ హీరోయిన్ గా మీనాక్షీ దీక్షిత్ ను, సెకెండ్ హీరోయిన్ గా డింపుల్ హయతిని తీసుకున్నారు. సినిమాలో ఓ కీలకమైన ఫిమేల్ పాత్ర కోసం అనసూయను తీసుకున్నారు. తను రెగ్యులర్ పాత్రలు […]

Advertisement
Update: 2020-11-13 00:30 GMT

తన కొత్త సినిమాలో యాంకర్ అనసూయకు చోటిచ్చాడు మాస్ రాజా రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఖిలాడీ అనే సినిమాలో అనసూయ కూడా కనిపించబోతోంది. అయితే ఆమె హీరోయిన్ కాదు.

ఈ సినిమాలో హీరోయిన్లను ఆల్రెడీ ఫిక్స్ చేశారు. ఫస్ట్ హీరోయిన్ గా మీనాక్షీ దీక్షిత్ ను, సెకెండ్ హీరోయిన్ గా డింపుల్ హయతిని తీసుకున్నారు. సినిమాలో ఓ కీలకమైన ఫిమేల్ పాత్ర కోసం అనసూయను తీసుకున్నారు.

తను రెగ్యులర్ పాత్రలు పోషించనని, తనకంటూ కాస్త గుర్తింపునిచ్చే క్యారెక్టర్స్ మాత్రమే చేస్తానని అనసూయ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి నటి, ఖిలాడీలో నటించడానికి ఒప్పుకుందంటే, కచ్చితంగా ఆ పాత్ర కొత్తగా ఉండే అవకాశం ఉంది.

కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి రానుంది ఖిలాడీ.

Advertisement

Similar News