అవన్నీ అబద్ధాలంటున్న క్రిష్

కరోనా కష్టాలకు, లాక్ డౌన్ ఆంక్షలకు ఎదురొడ్డి మరీ షూటింగ్ స్టార్ట్ చేశాడు క్రిష్. చిన్న కథ అనుకున్న ఈ దర్శకుడు.. పవన్ సినిమా వర్క్ ను పక్కనపెట్టి మరీ లో-బడ్జెట్ లో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అయితే అంతలోనే అవాంతరం. సెట్స్ లో ఎవరికో కరోనా వచ్చిందట. దీంతో షూటింగ్ మొత్తం ఆపేశారట. అధికారులు కూడా ఈ వ్యవహారంపై ఓ కన్నేశారంట. ఇలా 24 గంటలుగా తన సినిమాపై జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు […]

Advertisement
Update: 2020-09-03 09:00 GMT

కరోనా కష్టాలకు, లాక్ డౌన్ ఆంక్షలకు ఎదురొడ్డి మరీ షూటింగ్ స్టార్ట్ చేశాడు క్రిష్. చిన్న కథ అనుకున్న ఈ దర్శకుడు.. పవన్ సినిమా వర్క్ ను పక్కనపెట్టి మరీ లో-బడ్జెట్ లో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అయితే అంతలోనే అవాంతరం. సెట్స్ లో ఎవరికో కరోనా వచ్చిందట. దీంతో షూటింగ్ మొత్తం ఆపేశారట. అధికారులు కూడా ఈ వ్యవహారంపై ఓ కన్నేశారంట.

ఇలా 24 గంటలుగా తన సినిమాపై జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు క్రిష్ ఖండించాడు. తన యూనిట్ లో ఎవ్వరికీ కరోనా రాలేదని స్పష్టంచేశాడు. దీంతో ఈ సినిమాపై కమ్ముకున్న కారుమబ్బులు తొలిగిపోయాయి.

సినిమాను ఇలా ప్రకటించి అలా సెట్స్ పైకి తీసుకొచ్చాడు క్రిష్. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ పెట్టుకున్నాడు. కుదిరితే సింగిల్ షెడ్యూల్ లో, కుదరకపోతే మరో షెడ్యూల్ లో సినిమాను పూర్తిచేయాలని ప్లాన్. ఆల్రెడీ ఖాళీగా ఉన్న వైష్ణవ్ తేజ్ ను హీరోగా, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రకుల్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు.

వీళ్లిద్దరూ సెట్స్ పైకి వచ్చేశారు. సినిమా టాకీ పార్టీ ఈ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది.

Advertisement

Similar News