మహేష్ మూవీలో "ఈగ" విలన్?

రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను ప్రకటించాడు మహేష్ బాబు. ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి నటీనటుల్ని ఎంపిక చేసే ప్రాసెస్ మొదలైంది. ఇందులో భాగంగా కన్నడ నటుడు సుదీప్ పేరు తెరపైకి వచ్చింది. సర్కారు వారి పాట సినిమాలో విలన్ పాత్ర కోసం సుదీప్ ను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్టోరీ విన్న సుదీప్, మహేష్ కు ప్రతినాయకుడిగా […]

Advertisement
Update: 2020-06-11 07:35 GMT

రీసెంట్ గా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను ప్రకటించాడు మహేష్ బాబు. ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి నటీనటుల్ని ఎంపిక చేసే ప్రాసెస్ మొదలైంది. ఇందులో భాగంగా కన్నడ నటుడు సుదీప్ పేరు తెరపైకి వచ్చింది.

సర్కారు వారి పాట సినిమాలో విలన్ పాత్ర కోసం సుదీప్ ను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్టోరీ విన్న సుదీప్, మహేష్ కు ప్రతినాయకుడిగా నటించేందుకు ఒప్పుకున్నాడట. అయితే 30 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చాడని, ఆ టైమ్ లో షూట్ పూర్తిచేయాల్సి ఉంటుందని కండిషన్ కూడా పెట్టాడట.

నిజానికి ఈ విలన్ పాత్ర కోసం ముందుగా ఉపేంద్రను అనుకున్నారు. విలన్ గా నటించడానికి ఉపేంద్రకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రస్తుతం ఉపేంద్రకు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల కాల్షీట్లన్నీ వేస్ట్ అయ్యాయి. కాబట్టి మహేష్ సినిమాకు ఇప్పట్లో కాల్షీట్లు కేటాయించలేడు. అందుకే ఆ అవకాశం సుదీప్ ను వరించిందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Tags:    
Advertisement

Similar News