ఢిల్లీ అల్లర్లపై హోం మంత్రి వివరణ..?

దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లకు సంబంధించిన అంశం పార్లమెంటులో చర్చకు రానుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనిపై మార్చి 11న వివరణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఢిల్లీ అల్లర్ల ఘటనపై చర్చ చేపట్టాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, రెండు రోజుల్లో హోలీ పండుగ వస్తున్న సమయంలో అల్లర్లపై చర్చ జరిగితే శాంతి […]

Advertisement
Update: 2020-03-06 22:35 GMT

దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల తీవ్ర హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లకు సంబంధించిన అంశం పార్లమెంటులో చర్చకు రానుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనిపై మార్చి 11న వివరణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

ఢిల్లీ అల్లర్ల ఘటనపై చర్చ చేపట్టాలని పార్లమెంటులో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, రెండు రోజుల్లో హోలీ పండుగ వస్తున్న సమయంలో అల్లర్లపై చర్చ జరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు.

అయినా సరే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఎలాగైనా సరే ఢిల్లీ హింసాత్మక ఘటనలపై కనీసం స్వల్పకాలిక చర్చ అయినా జరపాలని కోరారు. దీంతో మార్చి 11నే చర్చ, అదే రోజు హోం మంత్రి వివరణ ఇవ్వబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News