జనవరి 1న అమరావతిలో చంద్రబాబు, భువనేశ్వరి దీక్ష

అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా కొత్త సంవత్సరం 2020 జనవరి 1 నుంచి చంద్రబాబు యుద్ధం మొదలు పెట్టబోతున్నారట. ఇది అలాంటి ఇలాంటి యుద్ధం కాదట.. ఏకంగా భార్య భువనేశ్వరితో కలిసి సకుటుంబ సపరివారంగా జగన్ ప్రభుత్వంపై సమరానికి సై అంటున్నారు. చంద్రబాబు ఎంత పెద్ద ధర్నాలు చేసినా… ఆయన భార్య భువనేశ్వరి ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ తాజాగా భువనేశ్వరి కూడా చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కుతుండడం విశేషం. అమరావతి రాజధానిలోని కొందరు రైతుల ఉద్యమాలకు సంఘీభావంగా… […]

Advertisement
Update: 2019-12-31 01:01 GMT

అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా కొత్త సంవత్సరం 2020 జనవరి 1 నుంచి చంద్రబాబు యుద్ధం మొదలు పెట్టబోతున్నారట. ఇది అలాంటి ఇలాంటి యుద్ధం కాదట.. ఏకంగా భార్య భువనేశ్వరితో కలిసి సకుటుంబ సపరివారంగా జగన్ ప్రభుత్వంపై సమరానికి సై అంటున్నారు.

చంద్రబాబు ఎంత పెద్ద ధర్నాలు చేసినా… ఆయన భార్య భువనేశ్వరి ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ తాజాగా భువనేశ్వరి కూడా చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కుతుండడం విశేషం.

అమరావతి రాజధానిలోని కొందరు రైతుల ఉద్యమాలకు సంఘీభావంగా… ఏపీలో కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతేకాదు.. రాజధాని రైతుల కోసం అమరావతిలోనే జనవరి 1న చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి దంపతులు ఇద్దరూ కలిసి రైతులతో దీక్షలు చేయడానికి రెడీ అయ్యారు.

కొత్త సంవత్సరం నుంచి రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి చంద్రబాబు రెడీ అయిపోతున్నారు. తొలిసారి తన భార్యను ఆందోళనలకు దించుతున్నారు. కుమారుడు లోకేష్ ఎలాగూ ఆందోళనల్లో పాల్గొంటారు. దీన్ని బట్టి బాబు గారు ఇక సకుటుంబ సపరివార ఆందోళనలకు ఏపీలో శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News