చెల్లిని మిస్ అవుతున్నా.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లోకి వెళ్లిన షర్మిలకు డిపాజిట్లు కూడా రావన్నారు సీఎం జగన్. చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తోందన్నారు.

Advertisement
Update: 2024-05-04 06:55 GMT

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్‌ రెడ్డి. టైమ్స్‌ నౌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చెల్లిని మిస్‌ అవుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మీ చెల్లిని మీరు మిస్ అవుతున్నారా అన్న యాంకర్ ప్రశ్నకు సీఎం జగన్‌.. కచ్చితంగా మిస్సవుతున్నా అని సమాధానం ఇచ్చారు. కానీ, దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లిందన్నారు. కానీ ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయి అని బదులిచ్చారు.

తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లోకి వెళ్లిన షర్మిలకు డిపాజిట్లు కూడా రావన్నారు సీఎం జగన్. చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తోందన్నారు. షర్మిలను, ఏపీ కాంగ్రెస్‌ను రేవంత్‌ ద్వారా చంద్రబాబు నడిపిస్తున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యురాలై ఉండి బయటకు వెళ్లడం.. శత్రువులతో చేతులు కలపడం బాధ కలిగిస్తోందన్నారు సీఎం జగన్.

Tags:    
Advertisement

Similar News