ప్రధానిని ఉద్దేశించి ఉపాసన సంచలన ట్వీట్

నటుడు రాంచరణ్‌ భార్య ఉపాసన సంచలన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేశారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలతో ప్రధాని మోడీ సమావేశంపై స్పందించిన ఆమె… బాలీవుడ్ ప్రముఖులను గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో ఈ భేటీలు కేవలం హిందీ ఆర్టిస్టులకు మాత్రమే పరిమితమవడం బాధగా ఉందని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎంతో అభిమానించే దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమను విస్మరించారంటూ ఆమె విమర్శించారు. దక్షిణాది చలనచిత్ర రంగాన్ని చిన్నచూపు చూడడం బాధగా […]

Advertisement
Update: 2019-10-20 00:07 GMT

నటుడు రాంచరణ్‌ భార్య ఉపాసన సంచలన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేశారు.

బాలీవుడ్‌ సెలబ్రిటీలతో ప్రధాని మోడీ సమావేశంపై స్పందించిన ఆమె… బాలీవుడ్ ప్రముఖులను గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో ఈ భేటీలు కేవలం హిందీ ఆర్టిస్టులకు మాత్రమే పరిమితమవడం బాధగా ఉందని వ్యాఖ్యానించారు.

మిమ్మల్ని ఎంతో అభిమానించే దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమను విస్మరించారంటూ ఆమె విమర్శించారు. దక్షిణాది చలనచిత్ర రంగాన్ని చిన్నచూపు చూడడం బాధగా ఉందన్నారు.

భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలని మోడీని కోరుతున్నానని చెప్పారు. చాలా బాధతో తాను ఈ విషయం చెబుతున్నానంటూ ఉపాసన ట్వీట్ పెట్టారు. బాలీవుడ్‌ హీరోలు అమీర్‌ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో మోడీ దిగిన ఫొటోను కూడా ఆమె షేర్ చేస్తూ ఈ ట్వీట్ పెట్టారు.

Tags:    
Advertisement

Similar News