రేణు, అకీరా, ఆధ్య లతో... అడివి శేష్

అడివి శేష్ నటించిన ఎవరు అనే చిత్రాన్ని ఇటీవలే రేణు దేశాయి మరియు ఆవిడ పిల్లలు చూసారు. మరీ ముఖ్యం గా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కి సినిమా బాగా నచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా అడివి శేష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. Little #Adhya is camera shy and @renuudesai it was such a delight talking to you. Amazing poet you are! Thank you @premamalini & […]

Advertisement
Update: 2019-08-26 23:50 GMT

అడివి శేష్ నటించిన ఎవరు అనే చిత్రాన్ని ఇటీవలే రేణు దేశాయి మరియు ఆవిడ పిల్లలు చూసారు. మరీ ముఖ్యం గా పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కి సినిమా బాగా నచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా అడివి శేష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

“ఒక రోజంతా అకీరా తో గడిపాను. అకీరా చాలా అందం గా ఉన్నాడు. అకీరా కి నా సినిమా ‘ఎవరు’ బాగా నచ్చింది. నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము ఇద్దరం కలిసి కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. లంచ్ కలిసి చేశాము. అలాగే జీవితం గురించి చాలా విషయాలు చర్చించుకున్నాము. అకీరా కి మంచి వాయిస్ ఉంది. మేము ఇద్దరమూ ఎడమ చేతి వాటం కలగడం నన్ను ఆశ్చర్యపరిచింది. మా ఇద్దరికీ చాలా విషయాలు కామన్ గా ఉన్నాయి. అలాగే ఆద్య కి కెమెరా అంటే సిగ్గు. రేణు దేశాయి గారిని కలవడం సంతోషం గా ఉంది. ఆమె మంచి కవయిత్రి. ఆమె తో మాట్లాడటం సంతోషాన్ని ఇచ్చింది. ఇది అంత జరగటానికి కారణం అయిన ప్రేమ గారు, మిహిర గారికి ధన్యవాదాలు” అని శేష్ పేర్కొన్నాడు.

Tags:    
Advertisement

Similar News