మరోసారి సాయి ధరమ్ తేజ్ తో..... రాశి ఖన్నా

కొన్నాళ్లపాటు వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించిన ‘చిత్రలహరి’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక తాజాగా తన తదుపరి సినిమా ని మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడు ఈ మెగా హీరో. ‘ప్రతి రోజు పండగే’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ […]

Advertisement
Update: 2019-06-20 02:18 GMT

కొన్నాళ్లపాటు వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించిన ‘చిత్రలహరి’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు.

ఇక తాజాగా తన తదుపరి సినిమా ని మారుతి దర్శకత్వంలో చేయబోతున్నాడు ఈ మెగా హీరో. ‘ప్రతి రోజు పండగే’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇంతకుముందు కూడా సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నా జంటగా ‘సుప్రీమ్’ సినిమాలో కలిసి నటించారు.
సాయి ధరమ్ తేజ్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా లలో ఒకటి ‘సుప్రీమ్’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో రాశి ఖన్నా తేజ్ తో రొమాన్స్ చేసింది.

ఆ సినిమా విడుదలైన ఇన్నాళ్ళకు…. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. ముందు నిధి అగర్వాల్ పేరు వినిపించినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం రాశి ఖన్నా ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 27 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.

Tags:    
Advertisement

Similar News