మన్మధుడు-2.... ఇకపై అన్నీ ఇక్కడే

మన్మధుడు-2 సినిమాకు సంబంధించి మొన్నటివరకు పోర్చుగల్ లో భారీ షెడ్యూల్ నిర్వహించారు. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. ఈమధ్య కాలంలో నాగార్జున విదేశాల్లో ఇంత ఎక్కువ టైమ్ ఎప్పుడూ గడపలేదు. కథ ప్రకారం తప్పదు కాబట్టి, భార్య అమలతో పాటు పోర్చుగల్ వెళ్లిన నాగ్, ఎట్టకేలకు ఆ పెద్ద షెడ్యూల్ పూర్తిచేశాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ఇకపై ఫారిన్ షెడ్యూల్స్ ఉండవని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పోర్చుగల్ షెడ్యూల్ చాలా […]

Advertisement
Update: 2019-05-21 11:21 GMT

మన్మధుడు-2 సినిమాకు సంబంధించి మొన్నటివరకు పోర్చుగల్ లో భారీ షెడ్యూల్ నిర్వహించారు. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. ఈమధ్య కాలంలో నాగార్జున విదేశాల్లో ఇంత ఎక్కువ టైమ్ ఎప్పుడూ గడపలేదు. కథ ప్రకారం తప్పదు కాబట్టి, భార్య అమలతో పాటు పోర్చుగల్ వెళ్లిన నాగ్, ఎట్టకేలకు ఆ పెద్ద షెడ్యూల్ పూర్తిచేశాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ఇకపై ఫారిన్ షెడ్యూల్స్ ఉండవని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

పోర్చుగల్ షెడ్యూల్ చాలా బాగా జరిగిందని ప్రకటించిన యూనిట్.. మన్మధుడు-2 సినిమాకు సంబంధించి నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని స్పష్టంచేసింది. అంతేకాదు, ఇకపై జరగబోయే షెడ్యూల్స్ అన్నీ ఇండియాలోనే ఉంటాయని కూడా స్పష్టంచేసింది.

మన్మధుడు-2 సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. ఎలాంటి హైప్ ఇవ్వకుండా, ఎప్పటికప్పుడు షూటింగ్ లొకేషన్ స్టిల్స్, సినిమా స్టిల్స్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు రకుల్ తో నాగార్జున సరసాలాడుతున్న స్టిల్ విడుదల చేశారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Tags:    
Advertisement

Similar News