చంద్రబాబు పశ్చాత్తాపం !
అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేయడంలో, ఆ వ్యవస్థల్లో తన వాళ్ళను చొప్పించడంలో…. ఈ దేశంలోనే సాటిలేని, మేటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు…. ఒకే ఒక్క వ్యవస్థను మేనేజ్ చేయాలన్న ఆలోచన ఇప్పటిదాకా రానందుకు ఇప్పుడు తన సన్నిహితుల వద్ద తెగ బాధపడిపోతున్నట్టు వ్యంగ్య బాణాలు విసురుతున్నారు రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు కుటిల నీతిని ఎండగడుతూ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఇదే…. చంద్రబాబు తన […]
అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేయడంలో, ఆ వ్యవస్థల్లో తన వాళ్ళను చొప్పించడంలో…. ఈ దేశంలోనే సాటిలేని, మేటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు…. ఒకే ఒక్క వ్యవస్థను మేనేజ్ చేయాలన్న ఆలోచన ఇప్పటిదాకా రానందుకు ఇప్పుడు తన సన్నిహితుల వద్ద తెగ బాధపడిపోతున్నట్టు వ్యంగ్య బాణాలు విసురుతున్నారు రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు కుటిల నీతిని ఎండగడుతూ విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఇదే….
చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సిబిఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ బాధపడుతున్నాడట.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 1, 2019