Maharshi Movie: ఎట్టకేలకు మహర్షి పై నోరు విప్పిన డీఎస్పీ

Maharshi Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో నే ప్రత్యేకమైన 25 వ చిత్రం మహర్షి తో బిజీ గా ఉన్నాడు.

Advertisement
Update: 2019-03-23 00:22 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో నే ప్రత్యేకమైన 25 వ చిత్రం మహర్షి తో బిజీ గా ఉన్నాడు. 25 వ చిత్రం అంటే ఎవరికైనా ప్రత్యేకమే. అందుకే చిత్ర యూనిట్ కూడా చాలా శ్రద్ధ తో ఈ సినిమా పనులు చూసుకుంటోంది.

ఈ సినిమా మహేష్ కి ఒక మంచి మెమరీ అవ్వాలని అందరూ కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమా కోసం అందరికన్నా మొదటగా పని మొదలు పెట్టింది మాత్రం దేవి శ్రీ ప్రసాద్. మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా తో బిజీ గా ఉన్నప్పుడే…. దేవి శ్రీ ప్రసాద్ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి తో కలిసి అమెరికా లో మహర్షి కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు

అయితే గత కొద్దీ రోజులు గా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో దేవి ని మ్యూజిక్ గురించి అప్డేట్ ఇవ్వమని వెంట పడుతూ ఉండగా మొత్తానికి దేవి ఈ రోజు మౌనం వీడాడు. ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతా లో సినిమా లోని మొదటి పాట గురించి పోస్ట్ చేసాడు.

"ఎవరైతే మహర్షి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వారందరికీ ఒక శుభ వార్త. ఈ నెల 29 న సినిమాలోని మొదటి పాట ని విడుదల చేయనున్నాము" అని చెప్పాడు.

అలాగే ఒక వీడియో కూడా పోస్ట్ చేసాడు. అందులో మహేష్ కూతురు సితార చారుశీల పాట కి డాన్స్ చేస్తూ కనిపించింది.



Tags:    
Advertisement

Similar News