కాంగ్రెస్‌కు సబితా ఇంద్రారెడ్డి షాక్‌

ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగలే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఉదయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో కేటీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌ రెడ్డి భేటీ అయినట్టు సమాచారం. కుమారుడితో కలిసి ఆమె టీఆర్‌ఎస్‌ లో చేరే అవకాశం ఉంది. ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విశ్వేశ్వర రెడ్డికి ప్రాధాన్యత ఇస్తుండడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. సబితా ఇంద్రా రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవడం…. లేదంటే ఆమె […]

Advertisement
Update: 2019-03-10 02:43 GMT

ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగలే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.

ఉదయం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో కేటీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌ రెడ్డి భేటీ అయినట్టు సమాచారం. కుమారుడితో కలిసి ఆమె టీఆర్‌ఎస్‌ లో చేరే అవకాశం ఉంది.

ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విశ్వేశ్వర రెడ్డికి ప్రాధాన్యత ఇస్తుండడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. సబితా ఇంద్రా రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవడం…. లేదంటే ఆమె కుమారుడు కార్తీక్‌ రెడ్డికి టీఆర్‌ఎస్ ఎంపీ సీటు లేదా ఎమ్మెల్సీ ఇచ్చేలా పలు ప్రతిపాదనలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News