ఇంటికో బిందె నీళ్లు తీసుకెళ్లి ఇవ్వండి... కార్యకర్తలకు బాబు పిలుపు

విచిత్రమైన ఆలోచనలు చేయడంలో ముందుండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన ఆలోచన చేశారు. అమరావతిలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు… సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు చంద్రబాబు ఒక సూచన చేశారు. చిత్తూరు జిల్లాలో కృష్ణాజలాలు చేరిన చోటు నుంచి ట్యాంకర్లు, డ్రమ్ములతో నీటిని తీసుకెళ్లి… గ్రామాల్లో ఇంటికో బిందె చెప్పున పంపిణీ చేయాలని సూచించారు. అలా చేయడం ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వచ్చాయన్న […]

Advertisement
Update: 2019-03-09 20:34 GMT

విచిత్రమైన ఆలోచనలు చేయడంలో ముందుండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన ఆలోచన చేశారు. అమరావతిలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు… సవాళ్లను అధిగమించి ముందుకెళ్తున్నామని చెప్పారు.

చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు చంద్రబాబు ఒక సూచన చేశారు. చిత్తూరు జిల్లాలో కృష్ణాజలాలు చేరిన చోటు నుంచి ట్యాంకర్లు, డ్రమ్ములతో నీటిని తీసుకెళ్లి… గ్రామాల్లో ఇంటికో బిందె చెప్పున పంపిణీ చేయాలని సూచించారు.

అలా చేయడం ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వచ్చాయన్న విషయం తెలియజేయాలన్నారు. ఇంటికో బిందె నీళ్లు పంపిణీ చేయడం ద్వారా ఇక మనకు కరువే లేదన్న ఆలోచన ప్రజల్లో కలిగించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Tags:    
Advertisement

Similar News