వైసీపీ కార్యాలయానికి వచ్చిన కొణతాల

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీ కార్యాలయానికి వచ్చారు. ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడేందుకు కొణతాల వచ్చారు. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన కొణతాల… సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో సమావేశం అయ్యారు. వైసీపీ మ్యానిఫెస్టోలో ఉత్తరాంధ్ర సమస్యలను చేర్చాల్సిందిగా కోరారు. ఉత్తరాంధ్ర సమస్యలపై తన వద్ద ఉన్న వివరాలను అందజేశారు. అన్ని పార్టీలకు ఉత్తరాంధ్ర సమస్యలను వివరిస్తానని కొణతాల చెప్పారు. విశాఖ రైల్వే జోన్ వచ్చినందుకు ఆనందించాలో… బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. జోన్ ఇచ్చి విశాఖ […]

Advertisement
Update: 2019-02-28 05:26 GMT

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీ కార్యాలయానికి వచ్చారు. ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడేందుకు కొణతాల వచ్చారు. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన కొణతాల… సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో సమావేశం అయ్యారు.

వైసీపీ మ్యానిఫెస్టోలో ఉత్తరాంధ్ర సమస్యలను చేర్చాల్సిందిగా కోరారు. ఉత్తరాంధ్ర సమస్యలపై తన వద్ద ఉన్న వివరాలను అందజేశారు. అన్ని పార్టీలకు ఉత్తరాంధ్ర సమస్యలను వివరిస్తానని కొణతాల చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ వచ్చినందుకు ఆనందించాలో… బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. జోన్ ఇచ్చి విశాఖ డివిజన్‌ను తీసేయడం బాధగా ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News