పవన్ నన్ను ఆహ్వానించలేదు.... గుంటూరు నుంచి పోటీ
నటుడు అలీ టీడీపీ గూటిలోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్పోర్టులో జగన్ను అలీ కలవడంతో ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ముహూర్తం కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇంతలోనే ఇటీవల ఒకే రోజు అటు చంద్రబాబును, ఇటు పవన్ కల్యాణ్ను అలీ కలవడంతో అలీ వైసీపీలో చేరుతారన్న ప్రచారానికి తెరపడింది. అలీ కూడా జగన్తో ఫొటో దిగినంత మాత్రాన పార్టీలో చేరుతామా అని ప్రశ్నించారు. ఇప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావుతో అలీ భేటీ అయ్యారు. పొలిటికల్ […]
నటుడు అలీ టీడీపీ గూటిలోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎయిర్పోర్టులో జగన్ను అలీ కలవడంతో ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది.
ముహూర్తం కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇంతలోనే ఇటీవల ఒకే రోజు అటు చంద్రబాబును, ఇటు పవన్ కల్యాణ్ను అలీ కలవడంతో అలీ వైసీపీలో చేరుతారన్న ప్రచారానికి తెరపడింది. అలీ కూడా జగన్తో ఫొటో దిగినంత మాత్రాన పార్టీలో చేరుతామా అని ప్రశ్నించారు.
ఇప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావుతో అలీ భేటీ అయ్యారు. పొలిటికల్ ఎంట్రీపై చర్చించారు. విశాఖలో దాదాపు గంట పాటు ఇద్దరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తన మనసులో మాటను గంటాకు వివరించారు అలీ. తాను వైసీపీలో చేరుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని వివరించారు.
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినా తనను ఆహ్వానించలేదని… కాబట్టి తాను జనసేనలోకి వెళ్లబోనని గంటాకు వివరించారు. 20ఏళ్లుగా తాను టీడీపీతోనే ఉన్నానని అలీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు గుంటూరు నుంచి పోటీ చేయాలని ఉందని గంటాకు వివరించారు.
అవకాశం వస్తే మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నట్టు స్పష్టంగా వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు కూడా తన రాజకీయ భవిష్యత్తు గురించి భరోసా ఇచ్చారని… మీరు కూడా సహకరించాలని గంటాను అలీ కోరారు. గత ఎన్నికల్లోనూ గంటా తరపున అలీ ప్రచారం నిర్వహించారు.