నన్ను పులి అన్నా.... పిల్లి అన్నా అభ్యంతరం లేదు.... కేసీఆర్‌ను విమర్శిస్తే మాపార్టీకే నష్టం

తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదన్నారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇకపై తాను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడుతానని…. రాజకీయాలు చేస్తానని చెప్పారు. మిగిలిన సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే పాటుపడుతానని చెప్పారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి… వచ్చే ఐదేళ్లు రాజకీయాలు పక్కనపెట్టి నియోజక వర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. తనను గెలిపించిన నియోజక వర్గ ప్రజల కోసం సీఎంను, మంత్రులను కలుస్తానని వివరించారు. నియోజక వర్గ అభివృద్ధికి సీఎం, […]

Advertisement
Update: 2018-12-14 06:35 GMT

తాను కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదన్నారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇకపై తాను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడుతానని…. రాజకీయాలు చేస్తానని చెప్పారు. మిగిలిన సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే పాటుపడుతానని చెప్పారు.

మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి… వచ్చే ఐదేళ్లు రాజకీయాలు పక్కనపెట్టి నియోజక వర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. తనను గెలిపించిన నియోజక వర్గ ప్రజల కోసం సీఎంను, మంత్రులను కలుస్తానని వివరించారు.

నియోజక వర్గ అభివృద్ధికి సీఎం, మంత్రులు కూడా సహకరిస్తే మంచిదన్నారు. ఒకవేళ సహకరించకపోతే సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు చెబుతానన్నారు. ప్రజా తీర్పును చూసిన తర్వాత కూడా కేసీఆర్‌ను అనవసరంగా విమర్శిస్తే కాంగ్రెస్‌ పార్టీకే నష్టమని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రజలకు ఏం చేస్తామో కాంగ్రెస్ పార్టీ వివరించాలన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడం మానుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి మంచిదని సూచించారు. తనను పులి అనుకున్నా… పిల్లి అనుకున్నా వారి వారి ఇష్టానికే వదిలేస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News