కుప్పకూలిన తుమ్మల... కూకట్‌పల్లిలో ఓడిన సుహాసిని

తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంగుతిన్నారు. తొలుత ఆధిక్యంలో ఉన్న ఆయన రౌండ్లు సాగే కొద్ది వెనుకబడ్డారు. ఆఖరికి ఓటమిపాలయ్యారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పాలేరు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. గెలిచి ఉంటే మరోసారి మంత్రి పదవి ఖాయం అని భావించారు. కానీ తుమ్మలను పాలేరు ప్రజలు తిరస్కరించి ఘోర ఓటమిని మూటకట్టి పంపించారు. అటు ప్రతిష్టాత్మకంగా భావించిన కూకట్‌పల్లిలో […]

Advertisement
Update: 2018-12-11 01:51 GMT

తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంగుతిన్నారు. తొలుత ఆధిక్యంలో ఉన్న ఆయన రౌండ్లు సాగే కొద్ది వెనుకబడ్డారు. ఆఖరికి ఓటమిపాలయ్యారు.

దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పాలేరు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. గెలిచి ఉంటే మరోసారి మంత్రి పదవి ఖాయం అని భావించారు. కానీ తుమ్మలను పాలేరు ప్రజలు తిరస్కరించి ఘోర ఓటమిని మూటకట్టి పంపించారు.

అటు ప్రతిష్టాత్మకంగా భావించిన కూకట్‌పల్లిలో టీడీపీ తరపున పోటీ చేసిన నందమూరి సుహాసిని ఘోర పరాజయం పొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఆమె ఓడిపోయారు.

నాగార్జునసాగర్‌ నియోజవర్గంలో జానారెడ్డి ఓడిపోయారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు.

Tags:    
Advertisement

Similar News