అనుకున్నది సాధించిన పరశురాం?

చేతిలో 2-3 స్టోరీలున్నాయి. మరో 2 అడ్వాన్సులు కూడా ఉన్నాయి. గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి అతడు అడిగితే హీరోలు కూడా నో చెప్పరు. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, గీతగోవిందం సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు పరశురాం. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది. తన ఫేవరెట్ కథానాయకుడు అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి పావులు కదుపుతున్నాడు ఈ దర్శకుడు. ఈ మేరకు ఇప్పటికే ఓ మంచి కథ రాసుకున్న […]

Advertisement
Update: 2018-12-11 06:37 GMT
చేతిలో 2-3 స్టోరీలున్నాయి. మరో 2 అడ్వాన్సులు కూడా ఉన్నాయి. గీతగోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి అతడు అడిగితే హీరోలు కూడా నో చెప్పరు. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, గీతగోవిందం సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు పరశురాం. దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది.
తన ఫేవరెట్ కథానాయకుడు అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయడానికి పావులు కదుపుతున్నాడు ఈ దర్శకుడు. ఈ మేరకు ఇప్పటికే ఓ మంచి కథ రాసుకున్న పరశురాం, ఆ స్టోరీని బన్నీకి వినిపించడమే ఆలస్యం. కథ ఓకే అయితే, గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే సినిమా ఉంటుంది.
తను ఏ కథ రాసుకున్నా దాన్ని ముందుగా బన్నీకే వినిపిస్తానని పరశురాం గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈసారి కేవలం బన్నీని దృష్టిలో పెట్టుకొని అతడు కథ రాశాడు. మరి ఈ స్టోరీని బన్నీ అంగీకరిస్తాడా..? అటు అల్లు అర్జున్ కూడా ఓ మంచి కథ కోసం వెయిటింగ్. నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు ఇంకో సినిమా ప్రకటించని ఈ హీరో, పరశురాం చెప్పిన కథ నచ్చితే మాత్రం వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంది.
Tags:    
Advertisement

Similar News