బాబు తాజా రాజకీయం.... సంక్షోభంలో ఎన్టీఆర్ బయోపిక్
శరవేగంగా రాజకీయరంగులు మార్చడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో లేరన్నది నిరూపితమవుతున్న అంశమే. ఒక్క వైసీపీతో తప్ప ఇప్పుడున్న అన్ని పార్టీలతోనూ చంద్రబాబు కాపురం పూర్తి చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికినే ప్రశ్నిస్తూ టీడీపీని స్థాపించారు. ఇప్పుడు కాంగ్రెస్ కాళ్ల వద్దకు చంద్రబాబు చేరిపోయారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పినట్టు ఎక్కడ మొదలయ్యాడో… చంద్రబాబు అక్కడికే చేరిపోయారు. ఇదంతా ఒకెత్తు అయితే చంద్రబాబు కాంగ్రెస్తో కలవడంతో బాలకృష్ణ నటిస్తూ క్రిష్ దర్శకత్వంలో […]
శరవేగంగా రాజకీయరంగులు మార్చడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో లేరన్నది నిరూపితమవుతున్న అంశమే. ఒక్క వైసీపీతో తప్ప ఇప్పుడున్న అన్ని పార్టీలతోనూ చంద్రబాబు కాపురం పూర్తి చేశారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికినే ప్రశ్నిస్తూ టీడీపీని స్థాపించారు.
ఇప్పుడు కాంగ్రెస్ కాళ్ల వద్దకు చంద్రబాబు చేరిపోయారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పినట్టు ఎక్కడ మొదలయ్యాడో… చంద్రబాబు అక్కడికే చేరిపోయారు. ఇదంతా ఒకెత్తు అయితే చంద్రబాబు కాంగ్రెస్తో కలవడంతో బాలకృష్ణ నటిస్తూ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్పై పిడుగుపడినంత పని అయింది.
ఎన్టీఆర్ రాజకీయం మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగానే సాగింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని బయోపిక్లో చూపించాలంటే ప్రతి ఫ్రేమ్లోనూ కాంగ్రెస్ను నెగిటివ్గా చూపించాలి. ఎన్టీఆర్ చెప్పిన ఫేమస్ డైలాగ్ ”కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ వాళ్లు” అన్న డైలాగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద నెగిటివ్గా సినిమా తీస్తే బాబు వ్యూహం బెడిసికొట్టవచ్చు.
పోని ఎప్పటిలాగే వైఎస్పై బురదజల్లుతూ ఎన్టీఆర్ బయోపిక్ తీద్దామా అంటే అది వీలు కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు వైఎస్ ఏమీ ముఖ్యమంత్రిగా లేరు. కాబట్టి ఆ ఎత్తుకు అవకాశం లేదు. పోని ఆ సినిమాతో తమకు సంబంధం లేదని టీడీపీ చెప్పుకునేందుకు ఎన్టీఆర్గా నటిస్తున్నది టీడీపీ ఎమ్మెల్యే, బాబు బామ్మర్ది బాలకృష్ణే. ఈ పరిస్థితుల్లో క్రిష్, బాలకృష్ణల ఎన్టీఆర్ బయోపిక్ ఆత్మను కోల్పోయినట్టేనని భావిస్తున్నారు. ఇదే అదనుగా వర్మ కాస్త గట్టిగా ఫోకస్ పెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తే … క్రిష్, బాలకృష్ణల ఆత్మలేని ఎన్టీఆర్ బయోపిక్ తేలిపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.