నీయమ్మ... ఆంబోతులా తిరుగుతున్నావ్... ఒళ్లు దగ్గరపెట్టుకో... బయట తిరగలేవ్...
ఇటీవల టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడుల వ్యవహారం దుమారం రేపింది. దీన్ని తెలివిగా టీడీపీ వాళ్లు ఏపీపై కేంద్రం చేస్తున్న దాడిగా ప్రచారం చేశారు. బీజేపీ మాత్రం అందుకు ధీటుగా కౌంటర్ ఇచ్చుకోలేకపోతోంది. పొడిపొడి ప్రకటనలతో తప్ప గట్టిగా ఎదిరించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఒక టీవీ చానల్ …. సీఎం రమేష్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో చర్చ నిర్వహించింది. ఈ చర్చలో బీజేపీని, జీవీఎల్ నర్సింహారావును సీఎం రమేష్ నోటికొచ్చినట్టు తిట్టారు. […]
ఇటీవల టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడుల వ్యవహారం దుమారం రేపింది. దీన్ని తెలివిగా టీడీపీ వాళ్లు ఏపీపై కేంద్రం చేస్తున్న దాడిగా ప్రచారం చేశారు. బీజేపీ మాత్రం అందుకు ధీటుగా కౌంటర్ ఇచ్చుకోలేకపోతోంది. పొడిపొడి ప్రకటనలతో తప్ప గట్టిగా ఎదిరించలేకపోతోంది.
ఈ నేపథ్యంలో ఒక టీవీ చానల్ …. సీఎం రమేష్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో చర్చ నిర్వహించింది. ఈ చర్చలో బీజేపీని, జీవీఎల్ నర్సింహారావును సీఎం రమేష్ నోటికొచ్చినట్టు తిట్టారు. జీవీఎల్ ముఖం మీదే సీఎం రమేష్ అనరాని మాటలు అనేశారు.
”నీయమ్మ… ఒళ్లు దగ్గర పెట్టుకో, ఏం మాట్లాడుతున్నావ్. ప్రభుత్వంలో ఉన్నావ్… ధైర్యముంటే విచారణ జరిపించు. నిరూపించలేకపోతే ఏం చేస్తావ్. నీవు బయట తిరగగలవా…. బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా. నోరు ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడతావా. ఆంబోతులా ఆంధ్రప్రదేశ్పై నిన్ను వదిలారు…. వీడొక్కడే నీతిమంతుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు” అంటూ ఇలా సాగింది సీఎం రమేష్ తిట్లదండకం.
సీఎం రమేష్కు మాజీ ఎంపీ సబ్బంహరి కూడా వంత పాడారు. దీంతో జీవీఎల్ ఒంటరైపోయారు. బీజేపీ ఎంపీని సీఎం రమేష్ ఏకంగా నీ యమ్మ….. ఆంబోతు, ఒళ్లు దగ్గరపెట్టుకో, బయట తిరగలేవ్ అంటూ వార్నింగ్ ఇచ్చిన తీరు చూస్తే బీజేపీ వాళ్లు మరీ ఇంత చులకనైపోయారా అన్న అభిప్రాయం కలుగుతోంది.