మహర్షి వీసా సమస్యలు పరిష్కారం

లెక్కప్రకారం ఈపాటికి మహర్షి సినిమా అమెరికా షెడ్యూల్ మొదలుకావాలి. కానీ వీసా సమస్యల వల్ల ఆ సినిమా కొత్త షెడ్యూల్ ఆలస్యమవుతూ వస్తోంది. అలా ఇప్పటికి 3 సార్లు వాయిదాపడిన ఈ షెడ్యూల్, ఎట్టకేలకు ఓ డేట్ ఫిక్స్ చేసుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 15 నాటికి మహర్షి సినిమా యూఎస్ లో ల్యాండ్ అవుతుంది. కథ ప్రకారం, మహర్షి సినిమాకు అమెరికాకు కనెక్షన్ ఉంది. కేవలం పాటల షూటింగ్ కోసం అక్కడకు వెళ్లడం లేదు […]

Advertisement
Update: 2018-10-01 00:21 GMT

లెక్కప్రకారం ఈపాటికి మహర్షి సినిమా అమెరికా షెడ్యూల్ మొదలుకావాలి. కానీ వీసా సమస్యల వల్ల ఆ సినిమా కొత్త షెడ్యూల్ ఆలస్యమవుతూ వస్తోంది. అలా ఇప్పటికి 3 సార్లు వాయిదాపడిన ఈ షెడ్యూల్, ఎట్టకేలకు ఓ డేట్ ఫిక్స్ చేసుకుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 15 నాటికి మహర్షి సినిమా యూఎస్ లో ల్యాండ్ అవుతుంది.

కథ ప్రకారం, మహర్షి సినిమాకు అమెరికాకు కనెక్షన్ ఉంది. కేవలం పాటల షూటింగ్ కోసం అక్కడకు వెళ్లడం లేదు యూనిట్. కథ ప్రకారం సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు అక్కడ తెరకెక్కించాలి. అందులో భారీ యూనిట్ సిద్ధంచేసింది. దీంతో యూనిట్ లో సభ్యులందరికీ ఒకేసారి వీసాలు మంజూరు చేయడం కష్టమైంది. అలా ఇన్నాళ్లూ వీసా సమస్యల కారణంగా షూటింగ్ లో జాప్యం తలెత్తింది.

ఎట్టకేలకు ఈ వీసా సమస్యలన్నీ తొలిగినట్టు చెబుతున్నారు. ఓ ముగ్గురి వీసాలు మాత్రం ఇంకా క్లియర్ కాలేదని, వాళ్లను పక్కనపెట్టి మిగతా యూనిట్ మొత్తం అమెరికా వెళ్లడానికి సిద్ధమౌతోంది. అక్టోబర్ 15 నుంచి ఆ నెలంతా అమెరికాలోనే షూటింగ్ చేయాలని నిర్ణయించారు. కొన్ని సన్నివేశాలతో పాటు మహేష్ పై ఓ మాంటేజ్ సాంగ్ తీయబోతున్నారు.

అయితే ఈ షెడ్యూల్ తో అమెరికా పార్ట్ కంప్లీట్ అవ్వదట. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో యూఎస్ షెడ్యూల్ కూడా ఉంటుందట. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న మహర్షి సినిమాను విడుదల చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News