పవన్‌ మీటింగ్‌కు బస్సులిచ్చి జనాన్ని పంపా- ఏపీ మంత్రి

పవన్‌ కల్యాణ్ వెనుక టీడీపీ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ మంత్రి మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ మీటింగ్‌కు తాను కూడా జనాన్ని పంపించానని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో తాను గెలవడానికి కారణం పవన్ కల్యాణ్‌ మద్దతేనని అందుకే బస్సులు ఇచ్చి జనాన్ని కాకినాడ మీటింగ్‌కు పంపించానని ఢిల్లీలో మాణిక్యాలరావు చెప్పారు. ప్యాకేజ్‌ను పవన్‌ కూడా స్వాగతించే రోజు వస్తుందన్నారు. ప్యాకేజ్‌లో ఏముందో పవన్‌కు తెలియదన్నారు. పెట్టే తెరిస్తేనే కదా లడ్డూలు మంచివా లేక పాచిపోయినవా […]

Advertisement
Update: 2016-09-10 08:54 GMT

పవన్‌ కల్యాణ్ వెనుక టీడీపీ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ మంత్రి మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌ మీటింగ్‌కు తాను కూడా జనాన్ని పంపించానని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో తాను గెలవడానికి కారణం పవన్ కల్యాణ్‌ మద్దతేనని అందుకే బస్సులు ఇచ్చి జనాన్ని కాకినాడ మీటింగ్‌కు పంపించానని ఢిల్లీలో మాణిక్యాలరావు చెప్పారు. ప్యాకేజ్‌ను పవన్‌ కూడా స్వాగతించే రోజు వస్తుందన్నారు. ప్యాకేజ్‌లో ఏముందో పవన్‌కు తెలియదన్నారు. పెట్టే తెరిస్తేనే కదా లడ్డూలు మంచివా లేక పాచిపోయినవా అని తెలిసేది అని మాణిక్యాలరావు ప్రశ్నించారు. ఏపీకి అండగా ఉంటామని తమ అదిష్ఠానం హామీ ఇచ్చిందని తెలిపారు. సమర్థుడైన చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని అమిత్‌షా అన్నారని మంత్రి వెల్లడించారు. ప్రత్యేక హోదా కంటే నిధులు ఎక్కువగా ఇస్తున్నారని మాణిక్యాలరావు చెప్పారు. మొత్తానికి పవన్ మీటింగ్‌కు జనాన్ని తీసుకెళ్లడంలో ఏపీ మంత్రులు కూడా సహకరించారన్న మాట.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News